30.పాశురము
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరై అఙ్గప్పరై కొణ్ణువాత్తై, అణిపుదువై పైజ్లమల త్తణ్ణరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న శఙ్గతమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే ఇన్గప్పరిశురై ప్పారీరరణ్ణు మాల్వరైత్తోళ్ శెఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్ ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్చురువ రెమ్బావాయ్
భావము: ఓడలుగల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు 'పజై' అను వంకతో స్వామీ వీరు పొందిన పొందారు. యీ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్ల (విష్ణుచిత్తుల) పుత్రికయైన గోదాదేవి (అండాళ్ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది.
ఈ ముప్పది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున అనుసంధించువారు గొప్ప పర్వతవలెనున్న నాల్గు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే ఎఱ్ఱబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియః పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ 'తిరుప్పావై' ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున' శ్రీసూక్తిమాలిక' గ' ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు.
శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం....
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 30వ పాశురం