పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ.
ఈ క్షేత్రంలో శివుడు… బాలుడిగా అవతరించాడు.
ఈ క్షేత్రంలో శివుడు… దక్షిణామూర్తిగా బ్రహ్మ విష్ణువులకు బ్రహ్మోపదేశం చేశాడు.
ఈ క్షేత్రంలో శివుడు… విష్ణువు పాపాలను కడిగి వేశాడు.
ఈ క్షేత్రంలో శివుడు… తన తపస్సుతో కోటి మంది దేవతలను నేలకు దింపాడు.
కొండ మీద మెట్లను ఎక్కడానికే కాదు… జీవితంలోని కష్టాలను దాటడానికీ… భక్తులు కోటప్పను తలుచుకుంటారు!
అందు వల్లే ఈ క్షేత్రం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మ చారి అయిన దక్షణామూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కళ్యాణోత్సవాలు నిర్వహించారు. ధ్వజ స్తంభం కూడా ఉండదు.ఎటువైపు చూసినా మూడు శిఖరాలుగా కోటప్పకొండ కన్పిస్తుంది.
అందుకే కొండపై వెలసిన స్వామికి త్రికూటేశ్వరుడు అని పేరు వచ్చింది.గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయానికి చేరుకునే పురాతన మెట్ల మార్గం బయటపడింది.ఆలయచరిత్రకు సంబంధించిన జానపద ఒకటి ప్రచారంలో ఉంది.
పూర్వం యెల్లమండ గ్రామానికి చెందిన సాలంకయ్య అనే శివభక్తుడు జీవనభృతి కోసం కట్టెలు కొట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇతడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ జీవితం కొనసాగిస్తాడు. కానీ.. శివభక్తి ఫలితంగా సాలంకయ్యా ధనవంతుడు అవుతాడు. ధనవంతుడు అయినప్పటికీ విలాస జీవితాన్ని కాకుండా సాధారణంగా జీవితం కొనసాగిస్తూ. శివుడిని పూజిస్తూ వుండేవాడు.
ఒకరోజు సాలంకయ్య పూజచేస్తున్న తరుణంలో ఒక జంగమదేవరను చూసాడు. సాలంకయ్య భక్తికి మెచ్చి జంగమదేవర ప్రతిరోజు అతడి ఇంటికి వచ్చి పాలను త్రాగివెళ్ళేవాడు.
కొన్ని రోజుల తరువాత జంగమదేవర కనిపించలేదు. సాలంకయ్య అతడి కోసం ఎంతగా గాలించినప్పటికీ జంగమదేవరను చూడలేక పోయాడు. దీంతో తీవ్ర నిరాశ చెందిన సాలంకయ్య అన్నపానాదులు,నిద్రహారాలు మానేశాడు. సాలంకయ్యా నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరంలో సుందుడు, అతడి భార్య కుంద్రి నివసిస్తూ ఉండేవారు. వారికి ఆనందవల్లి (గొల్లభామ)అనే కూతురు పుట్టిన తరువాత వారు ధనవంతులు అయ్యారు.
గాఢమైన దైవభక్తి సంపన్నురాలైన ఆనందవల్లికి సాధారణ ప్రపంచ జీవితం మీద విరక్తి కలిగింది. ఆమె సదా శివుని భక్తిగితాలు ఆలపిస్తూ చివరకు కొంచంకొంచంగా ఏకాంతవాసానికి అలవడి తపోజీవనం ఆరంభించింది.
ఆమె భక్తికి మెచ్చి త్రికోటేశ్వరుడు జంగమదేవర రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం చెబుతోంది.
తరువాత ఆనందవల్లి రోజూ రుద్రాచలానికి వచ్చి శివునికి ఆభిషేకాదులు నిర్వహించి పాలు కానుకగా సమర్పించేది. ఈ విషయాన్ని సాలంకయ్యా తెలుసుకుంటాడు. అతడె ఆనందవల్లిని కలుసుకుని జంగమదేవర దర్శనం, ఆశీర్వాదం ఇప్పించనని కోరాడు. ఆమె అతని కోరికను మన్నించక తపసును కొనసాగించింది. కొన్నిరోజుల తరువాత వేసవి కాలంలో కూడా ఆనందవల్లి శివుని
ఆరాధించడానికి రుద్రాచలానికి వెళ్ళసాగింది. ఒకరోజు ఆమె అభిషేకం కోసం బిందె నిండా నీళ్లు తీసుకుపోతూ మార్గమద్యంలో దానిని ఒక రాతిమీద పెట్టి, మారేడుదళాలతో దానిని మూసి ఉంచింది. అప్పుడు ఓ కాకి నీళ్లు తాగడం కోసం ఆ బిందె మీద వాలింది. కాకి బరువుకు బిందె పక్కకు ఒరిగి బిందెలోని జలం మొత్తం
కిందికి పడిపోతుంది. దీంతో ఆగ్రహించిన ఆనందవల్లి ఈ ప్రాంతానికి కాకులు రాకూడదని శపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోకాకులు కనిపించడం లేదని ప్రాంతీయ వాసుకు విశ్వసిస్తున్నారు. తరువాత ఆనందవల్లి తపసుకు మెచ్చి జంగదేవర ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానం ప్రసాదించాడు. తరువాత ఆనందవల్లి ఏకాగ్రతతో శివుని గురించి తపసు కొనసాగించింది.
అందుకే కొండపై వెలసిన స్వామికి త్రికూటేశ్వరుడు అని పేరు వచ్చింది.గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయానికి చేరుకునే పురాతన మెట్ల మార్గం బయటపడింది.ఆలయచరిత్రకు సంబంధించిన జానపద ఒకటి ప్రచారంలో ఉంది.
పూర్వం యెల్లమండ గ్రామానికి చెందిన సాలంకయ్య అనే శివభక్తుడు జీవనభృతి కోసం కట్టెలు కొట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇతడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ జీవితం కొనసాగిస్తాడు. కానీ.. శివభక్తి ఫలితంగా సాలంకయ్యా ధనవంతుడు అవుతాడు. ధనవంతుడు అయినప్పటికీ విలాస జీవితాన్ని కాకుండా సాధారణంగా జీవితం కొనసాగిస్తూ. శివుడిని పూజిస్తూ వుండేవాడు.
ఒకరోజు సాలంకయ్య పూజచేస్తున్న తరుణంలో ఒక జంగమదేవరను చూసాడు. సాలంకయ్య భక్తికి మెచ్చి జంగమదేవర ప్రతిరోజు అతడి ఇంటికి వచ్చి పాలను త్రాగివెళ్ళేవాడు.
కొన్ని రోజుల తరువాత జంగమదేవర కనిపించలేదు. సాలంకయ్య అతడి కోసం ఎంతగా గాలించినప్పటికీ జంగమదేవరను చూడలేక పోయాడు. దీంతో తీవ్ర నిరాశ చెందిన సాలంకయ్య అన్నపానాదులు,నిద్రహారాలు మానేశాడు. సాలంకయ్యా నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరంలో సుందుడు, అతడి భార్య కుంద్రి నివసిస్తూ ఉండేవారు. వారికి ఆనందవల్లి (గొల్లభామ)అనే కూతురు పుట్టిన తరువాత వారు ధనవంతులు అయ్యారు.
గాఢమైన దైవభక్తి సంపన్నురాలైన ఆనందవల్లికి సాధారణ ప్రపంచ జీవితం మీద విరక్తి కలిగింది. ఆమె సదా శివుని భక్తిగితాలు ఆలపిస్తూ చివరకు కొంచంకొంచంగా ఏకాంతవాసానికి అలవడి తపోజీవనం ఆరంభించింది.
ఆమె భక్తికి మెచ్చి త్రికోటేశ్వరుడు జంగమదేవర రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం చెబుతోంది.
తరువాత ఆనందవల్లి రోజూ రుద్రాచలానికి వచ్చి శివునికి ఆభిషేకాదులు నిర్వహించి పాలు కానుకగా సమర్పించేది. ఈ విషయాన్ని సాలంకయ్యా తెలుసుకుంటాడు. అతడె ఆనందవల్లిని కలుసుకుని జంగమదేవర దర్శనం, ఆశీర్వాదం ఇప్పించనని కోరాడు. ఆమె అతని కోరికను మన్నించక తపసును కొనసాగించింది. కొన్నిరోజుల తరువాత వేసవి కాలంలో కూడా ఆనందవల్లి శివుని
ఆరాధించడానికి రుద్రాచలానికి వెళ్ళసాగింది. ఒకరోజు ఆమె అభిషేకం కోసం బిందె నిండా నీళ్లు తీసుకుపోతూ మార్గమద్యంలో దానిని ఒక రాతిమీద పెట్టి, మారేడుదళాలతో దానిని మూసి ఉంచింది. అప్పుడు ఓ కాకి నీళ్లు తాగడం కోసం ఆ బిందె మీద వాలింది. కాకి బరువుకు బిందె పక్కకు ఒరిగి బిందెలోని జలం మొత్తం
కిందికి పడిపోతుంది. దీంతో ఆగ్రహించిన ఆనందవల్లి ఈ ప్రాంతానికి కాకులు రాకూడదని శపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోకాకులు కనిపించడం లేదని ప్రాంతీయ వాసుకు విశ్వసిస్తున్నారు. తరువాత ఆనందవల్లి తపసుకు మెచ్చి జంగదేవర ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానం ప్రసాదించాడు. తరువాత ఆనందవల్లి ఏకాగ్రతతో శివుని గురించి తపసు కొనసాగించింది.
ఆనందవల్లి తపసుకు మెచ్చిన జంగమదేవర.ఆమెకు ప్రత్యక్షమై ఆమెను తిరిగి కుటుంబ జీవితం కొనసాగించమని చెప్పి బ్రహ్మచారిణి అయిన ఆమెను గర్భవతిగా మార్చాడు. అయితే ఆనందవల్లి మాత్రం తన గర్భాన్ని లక్ష్యపెట్టక శివారాధన కొనసాగిస్తూ
వచ్చింది.ఆమెను పరీక్షించడానికి ఎన్ని విధాలుగా కష్టపెటినా పూజించడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, జంగమదేవర తిరిగి ఆనందవల్లికి ప్రత్యక్షమై ఇక ఆమె శ్రమపడి రుద్రాచలం రావలసిన అవసరం లేదని తాను ఆమెను వెన్నంటి వచ్చి ఆమె పూజలు స్వీకరిస్తానని చెప్పి ఆమెను తిరిగి చూడకుండా నివాసానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. ఒకవేళ తిరిగి చూస్తే తాను అక్కడే నిలిచిపోతానని చెప్పాడు. ఆనందవల్లి
రుద్రాచలం నుండి కిందకు దిగుతూ కుతూహలం బ్రహ్మాచలం వద్ద తిరిగి చూసింది. దాంతో పరమశివుడు వెంటనే అక్కడే పక్కన ఉన్న గుహలో లింగరూపం ధరించాడు. ఆ పవిత్ర ప్రదేశమే ప్రస్థుతం కొత్తకోటేశ్వరాలయంగా పిలువబడుతూ ఉంది.ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. ఆనందవల్లి తాను చేసిన అపచారానికి చింతించస్తూ మరణించడానికి సిద్ధం అయింది. వెంటనే ఆమెకు శివుడు ప్రత్యక్షం
కావడమేకాక బాలుడు అక్కడి నుండి మాయం అయ్యాడు. ఆనందవల్లికి జరుగింది అంతా శివమాయ అని అర్ధం అయింది. చివరకు ఆమె శివునిలో ఐక్యం అయింది.ఈ ఆలయానికి దిగువ భాగాన శిలగా మారిన ఆనందవల్లికి గుడికట్టారు. ఆ విధంగా ఆనాటి నుండి ఈ దేవాలయ అర్చనాది కైంకర్యములు కొండకవూరి
వంశస్థులు ప్రమదప్ప, గురవప్ప వారి సంతతి సుమారు పన్నెండు తరాల నుంచి అర్చకులుగా ఉండటం ఈ క్షేత్రం యొక్క విశేషం.
వచ్చింది.ఆమెను పరీక్షించడానికి ఎన్ని విధాలుగా కష్టపెటినా పూజించడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, జంగమదేవర తిరిగి ఆనందవల్లికి ప్రత్యక్షమై ఇక ఆమె శ్రమపడి రుద్రాచలం రావలసిన అవసరం లేదని తాను ఆమెను వెన్నంటి వచ్చి ఆమె పూజలు స్వీకరిస్తానని చెప్పి ఆమెను తిరిగి చూడకుండా నివాసానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. ఒకవేళ తిరిగి చూస్తే తాను అక్కడే నిలిచిపోతానని చెప్పాడు. ఆనందవల్లి
రుద్రాచలం నుండి కిందకు దిగుతూ కుతూహలం బ్రహ్మాచలం వద్ద తిరిగి చూసింది. దాంతో పరమశివుడు వెంటనే అక్కడే పక్కన ఉన్న గుహలో లింగరూపం ధరించాడు. ఆ పవిత్ర ప్రదేశమే ప్రస్థుతం కొత్తకోటేశ్వరాలయంగా పిలువబడుతూ ఉంది.ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. ఆనందవల్లి తాను చేసిన అపచారానికి చింతించస్తూ మరణించడానికి సిద్ధం అయింది. వెంటనే ఆమెకు శివుడు ప్రత్యక్షం
కావడమేకాక బాలుడు అక్కడి నుండి మాయం అయ్యాడు. ఆనందవల్లికి జరుగింది అంతా శివమాయ అని అర్ధం అయింది. చివరకు ఆమె శివునిలో ఐక్యం అయింది.ఈ ఆలయానికి దిగువ భాగాన శిలగా మారిన ఆనందవల్లికి గుడికట్టారు. ఆ విధంగా ఆనాటి నుండి ఈ దేవాలయ అర్చనాది కైంకర్యములు కొండకవూరి
వంశస్థులు ప్రమదప్ప, గురవప్ప వారి సంతతి సుమారు పన్నెండు తరాల నుంచి అర్చకులుగా ఉండటం ఈ క్షేత్రం యొక్క విశేషం.
క్షేత్రము చేరుటకు మార్గము
బస్ మార్గము / Bus Route
నరసరావుపేట నుండి కోటప్పకొండ 15 కి.మీ / Narasarao Pet to Kotappakonda 15 k.m
చిలకలూరిపేట నుండి కోటప్పకొండ 21 కి.మీ / Chilakaluripet to Kotappakonda 21 k.m
వినుకొండ నుండి కోటప్పకొండ 45 కి.మీ (వయా) పెట్లూరివారి పాలెం. / Vinukonda to Kotappakonda via Petloorivari palem 45 k.m
రైలు మార్గం / Train Route
రైలు మార్గం ద్వారా వచ్చే యాత్రికులు నరసరావుపేట చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వామి వారిని దర్శించుకోవచ్చు.
Nearest railway station is Narasarao pet.
మీకు ఏదైనా సమాచారం కావాలంటే మన హిందూ టెంపుల్స్ గైడ్ టీం సభ్యులకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. వారికి ముందుగా వాట్సాప్ లో మెసేజ్ పెట్టి కాల్ చేయగలరు.
Temple Timings
6.00 am to 1 pm
3.00 pm to 8.00 pm
చారిత్రకత
చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.
నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరివారిపాలెం జమిందార్లు అలాగే శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి భూములు సమర్పించారు.
భక్తులైన సాలంకులు, అతని ముగ్గురు తమ్ముళ్లు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగస్వరూపులు కావటం ఆనందవల్లి (గొల్లభామ) శివైక్య సంధానమవడం ఈ క్షేత్ర వైశిష్ట్యం.
బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా..:
దక్షయజ్ఞం విధ్వంసం తర్వాత శివుడు బ్రహ్మచారిగా చిరుప్రాయపు వటువుగా, మేధాదక్షిణామూర్తి రూపంలో కోటప్పకొండలో వెలిసినట్లు స్థల పురాణం.
దేవతలకు, మహర్షులకు, భక్తులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా కూడా గుర్తింపు ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రికూటములుగా వెలసిన త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే కోటప్పకొండ.
గర్భాలయ దక్షిణద్వారమందు ఉన్న శాసనాల వల్ల సిద్ధమల్లప్ప, శంభుమల్లమ్మలు వేయించిన శాసనాలు ఆలయ ప్రాచీనతను తెలియజేస్తున్నాయి.
క్రీస్తు శకం 6, 7శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు. నిర్మలత్వం, ప్రశాంతత మూర్తీభవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి.
ఈ స్వామి అనుగ్రహంతో సర్వవిద్యలు లభిస్తాయని ప్రతీతి.
దక్షిణాభిముఖంగా ఆశీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తి పేరు సార్థకమైందని చెబుతారు. 200 ఏళ్లకు పూర్వం బ్రహ్మశిఖరంపై పినపాడు వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ, మొక్కుబడులు, అష్టదిగ్బంధ గణపతి, సంతాన కోటేశ్వర యంత్రాలు స్థాపించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి.
విష్ణు శిఖరం మేధాదక్షిణా మూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది. దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది. అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండకు ఘాట్ రోడ్డు నిర్మాణం చేయించారు. ఘాట్ రోడ్డులోని రెండు మలుపుల్లో బ్రహ్మదేవుని విగ్రహాన్ని అదే మలుపులో మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆదిశేషుని విగ్రహాలను ఏర్పాటు చేయించారు. కొండపైన భారీ వినాయకుని విగ్రహాన్ని కూడా నిర్మించారు.
బ్రహ్మ శిఖరం దక్షయజ్ఞం అనంతరం త్రికోటేశ్వరుడు కోటప్పకొండలో ధ్యానశంకరునిగా, దక్షిణామూర్తిగా వెలిశాడని స్థల పురాణం. ఆయన వద్ద బ్రహ్మ, విష్ణువులు అనేక మంది దేవతలకు ఇక్కడ బ్రహ్మోపదేశం చేశారు. అందువల్లే ఇక్కడ బ్రహ్మశిఖరం ఏర్పాటైంది.
కొండపైకి మార్గాలు
దివ్య మహిమ కలిగిన త్రికూటా చలంపైకి చేరడానికి ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి.
పాపవినాశన స్వామి దేవస్థానం పడమరగా మెట్ల మార్గం ఒకటి, వాహనాలతో పైకి వెళ్లడానికి వీలుగా ఘాట్ రోడ్డు మార్గం మరోటి.
ఘాట్ రోడ్డులో పర్యాటకం
కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ఇంకా అభివృద్ధి చేస్తున్నారు.
భారీస్థాయి ఆక్వేరియం ఉంది.నెమళ్లు, కొంగలు, దుప్పులు, జింకలు ఇలా అనేక వన్యప్రాణులు పర్యాటక క్షేత్రంలో ఉన్నాయి.
టాయ్ట్రైన్ ఇది కొండ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల దూరం తిరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పిల్లల రాజ్యం నిండా రంగుల రాట్నాలు, రోప్వే ఆకర్షిస్తుంటాయి. కాళింది మడుగులో ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రత్యేకం.
మూడు కొండలపై వెలసిన ముక్కంటి :
దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియో గంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి (కోటప్పకొండ) పర్వతం పైన 12 ఏళ్లు వటుడిగా తపమాచరిస్తుం డగా, సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, రుషి పుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకుని జ్ఞాన దీక్ష పొందారు.
అందు వల్లే ఈ క్షేత్రం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మ చారి అయిన దక్షణామూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కళ్యాణోత్సవాలు నిర్వహించారు. ధ్వజ స్తంభం కూడా ఉండదు.
ఎటువైపు చూసినా మూడు శిఖరాలుగా కోటప్పకొండ కన్పిస్తుంది. అందుకే కొండపై వెలసిన స్వామికి త్రికూటేశ్వరుడు అని పేరు వచ్చింది.
ఈ మూడు శిఖరాలకు బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు అని పిలుస్తారు. బ్రహ్మ శిఖరంపై బ్రహ్మ నివసించాడని ప్రతీతి.
జ్యోతిర్లింగం ఈ ప్రాంతంలో లేకపోవటంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా అప్పుడు స్వామి ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక తీర్చుటకు జ్యోతిర్లింగంగా వెలిశాడు.
ఆ జ్యోతిర్లింగమే భక్తుల పూజలందుకుంటున్న కోటేశ్వర లింగం.
జంగం దేవర రూపంలో..
కోటప్పకొండ వద్ద ఉన్న కొండకావూరులోని గొల్లభామ ఆనందవల్లి త్రికోటేశ్వరునికి పూజలు చేయగా ఈశ్వరుడు జంగం దేవ రరూపంలో ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం చెపుతోంది.
ఆనందవల్లి పాప వినాచన దూన వద్దకు వెళ్లి తీర్ధం రుద్ర శిఖరానికి తెచ్చి జంగమయ్యకు అభిషేకాధిపూజలు చేసింది.
ఆమెను పరీక్షించేం దుకు ఎన్ని విధాలా కష్ట పెడుతున్నప్పటికీ పూజలు మాననం దునే ఆనందవల్లి ఇంటికి వస్తాను, అక్కడే వ్రతం ఆచరించమని జంగమయ్య ఆమె వెనుకనే బయలుదేరాడు. ఎలాంటి పరిస్థితు ల్లోను వెను దిరిగి చూడవద్దని చెప్పగా ప్రళయ ధ్వనులకు తాళలేక బ్రహ్మశిఖరం వద్ద వెను దిరిగి చూసింది.
జంగమయ్య అక్కడే శిలగా మారాడు. ఆ చోటనే కోటేశ్వరాలయం నిర్మించ బడింది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ శిలగా మారిన ప్రాంతంలో ఆనందవల్లి గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెపుతుంది.
రుద్రశిఖరంపై స్వామి వారు తపమాచరించారు. ఇక్కడే పాత కోటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆరుద్రోత్సవం సందర్భంగా కర్పూర జ్యోతి దర్శనం జరుగుతుంది. విష్ణుశిఖరంలో దక్ష యజ్ఞంలో పాల్గొన్న దేవతలు, రుషులు పాప విమోచనం పొందిన పవిత్ర స్థలంలో పాప విమోచనేశ్వర స్వామి ఆలయం ఉంది.
ఆరు వందల అడుగుల ఎత్తులో త్రికోటేశ్వర స్వామి దేవాల యం ఉంది. ఘాట్ రోడ్డు నిర్మాణంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగు తోంది.
Related Postings:
1.Kotappakonda 2
2.AndhraPreadesh Temple
3.Lord Shiva Famous Temple
4.Guntur Famous Temples
1.Kotappakonda 2
2.AndhraPreadesh Temple
3.Lord Shiva Famous Temple
4.Guntur Famous Temples
Transport
By Road:
Sri Trikoteswara Swamy Temple is 11 Km distance from Narasaraopet Bus station and 16 Km from Chilakaluripet.
By Train:
The nearest Railway Station is at Narasaraopet which is 11 km away from Sri Trikoteswara Swamy Temple.
By Air:
The nearest Airport is at Vijayawada-Gannavaram Airport which is 108 km away.
Sri Trikoteswara Swamy Temple Accommodation:
There are around four VIP Guest Houses and 30 Choultry rooms
1).TTD Anandavalli Choultry
2).Annapurna Sadanam
3).Nandi Guest House
4).Thotavari Satram
There are many other caste based Choultries are present at downhill.
Near by Temple
1.Sri Chaturmukha Brahmalingeswara Swamy
2.Guthikonda caves,Kotappakonda
Contact Details:
Sri Trikoteswara Swamy Temple,
Narasaraopet Mandal,
Kotappakonda-522601
Guntur District,A.P
key words:
Significance of kotappakonda,History of Kotappakonda,history and significance of telugu,History of Sri Trikoteswara Swamy Temple Kotappakonda,Kotappakonda Temple,Sri Trikoteswara Swamy Temple, Kotappakonda,Guntur,AP,Kotappakonda Sri Trikoteswara Swamy Temple,kotappakonda temple address,kotappakonda temple photos,kotappakonda matter in telugu,kotappakonda temple website,kotappakonda temple darshan timings,kotappakonda live,kotappakonda temple accommodation,kotappakonda videos
Tags
1000 years old
accommodation
Andhrapradesh
Guntur
Palandu District
Siva Temples
Temples Guide Team